ప్రవాస భారతీయుల ప్రయోజనాలను కాపాడేలా ఆస్తి హక్కు చట్టాన్ని సవరించేందుకు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీఓపీఐఓ) భావిస్తోంది. ఆగస్టు 21, 22 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న 20వ వార్షిక సమావేశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని జీఓపీఐఓ యోచిస్తోంది.