హిందూ మత సంప్రదాయాల ప్రకారం దహనక్రియలను నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలంటూ బ్రిటన్లో న్యాయపోరాటం చేస్తున్న భారత సంతతి సామాజిక, ఆధ్యాత్మిక నేత దేవిందర్ ఘాయ్ విజయం సాధించాడు. తాను చనిపోయిన తరువాత హిందూ మతాచారం ప్రకారం బహిరంగంగా అంత్యక్రియలను నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ 71 సంవత్సరాల ఘాయ్ కోర్టుకెక్కారు. దీనికి స్పందించిన బ్రిటన్ న్యాయస్థానం ఘాయ్ కోరికను మన్నిస్తూ అనుమతి మంజూరు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది.