ప్రపంచ నాగరికతకు జాతిపిత మహాత్మాగాంధీ అందించిన శాంతి సందేశం గురించి తాను ఓ పుస్తకం రాయాలని భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ వెల్లడించారు. ఇరవయ్యో శతాబ్దంలోని గొప్ప నాయకుల్లో ఒకరైన మహాత్ముడు ఎప్పుడూ అధికారం కోసం ప్రాకులాడలేదని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.