మరణశిక్ష పడ్డ 17 మంది భారతీయులను యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చిత్రహింసలకు గురి చేస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేరాన్ని ఒప్పుకోమంటూ భారతీయులను బలవంతం చేస్తున్న యూఏఈ అధికారులు, అందుకు భారతీయులు ఒప్పుకోకపోవటంతో టార్చర్ చేస్తోందని అమ్నెస్టీ ఆరోపించింది.