అదనపు కట్నం కోసం విదేశీ గడ్డపై సైతం భార్యను కొట్టి వేధించాడన్న అభియోగం రుజువు కావడంతో ఓ ప్రవాస భారతీయుడికి కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, 5 వేల రూపాయల జరిమానాను విధించింది. అలాగే ఈ కేసులో ముద్దాయిలైన అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్తలకు మూడు నెలల జైలు శిక్షతో పాటు 3 వేల రూపాయల జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.