వివిధ పనులకోసం మలేషియా వెళ్లే భారతీయ వర్కర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని భారత ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఉపాధి మార్గదర్శక సూత్రాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలనీ, మలేషియా వెళ్లేందుకు నిజమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని లిపింది. అదే విధంగా రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, వారు చెప్పే మాటలను నమ్మకుండా తగిన జాగ్రత్తలను పాటించాలని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.