వరద బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రుల స్వచ్ఛంద సేవా సంస్థ స్పందన ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలోని తమ కార్యకర్తల ద్వారా కృష్ణా జిల్లాలోని మూలపాడు గ్రామంలో వరద బాధితులకు స్పందన తన ఆపన్నహస్తాన్ని చాచింది. స్పందన విజయవాడ విభాగం కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో పదిహేను మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు వంద కుటుంబాలకు పైగా రిలీఫ్ కిట్లను అందించారు.