బ్రిటన్లో జరిగిన వీసా కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు భారతీయులకు జైలు శిక్షను విధించారు. పైగా, ఈ ముగ్గురు వ్యక్తులూ భార్యాభర్తలు కావటం విశేషం. ఓ పత్రికా విలేకరి ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భారీ కుంభకోణంలో జతిందర్ కుమార్ శర్మ (44), ఆయన ఇద్దరు భార్యలు రాఖి షాహి (31), నీలమ్ శర్మలు ప్రధాన నిందితులు.