ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విన్న ప్రవాస భారతీయులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్నటిదాకా ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అమెరికా, యూకే, గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులు ఆయన ఇక తిరిగి రారని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.