మలేషియాలోని షా ఆలమ్లో హిందూ దేవాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన కేసులో ఆరుగురు ముస్లింలపై విద్రోహం నేరం కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన మరో ఆరుగురిపై చట్ట వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారన్న నేరంకింద అభియోగాలు నమోదు చేశారు.