బ్రిటీష్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) వివాదాస్పద సూత్రాలను సమర్థించిన ప్రవాస సిక్కు జాతీయుడు రాజీందర్ సింగ్కు ఆ పార్టీ తీర్థం లభించనుంది. దీంతో బీఎన్పీలో చేరిన తొలి శ్వేతజాతీయేతరుడిగా రాజీందర్ రికార్డు సృష్టించనున్నారు. బ్రిటన్లో జాత్యహంకార పార్టీగా ముద్రపడిన బీఎన్పీ స్థాపించిన రోజునుంచీ.. దాంట్లో శ్వేతజాతీయులే సభ్యులుగా ఉన్నారు. అయితే.. సంవత్సరాల తరబడీ కొనసాగుతున్న ఈ పద్ధతికి రాజీందర్ చెక్ పెట్టినట్లయ్యంది...