సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంచేత సౌదీలో దేశ బహిష్కారానికి గురైన ఆయా కేంద్రాలలో మగ్గుతున్న భారతీయులను ఆదుకుని, వారిని వెంటనే వెనక్కి రప్పించే చర్యలు తీసుకోవాలని కేరళ విపక్ష నాయకుడు ఉమెన్ చాందీ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ దేశ బహిష్కార కేంద్రాలలో సరైన సదుపాయాలు లేని కారణంగా వందలాదిమంది భారతీయులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.