శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2015 (21:10 IST)

సేవ్ టెంపుల్స్ గోదావరి మహా పుష్కరాల ఫొటోగ్రఫీ కాంటెస్ట్ విజేతల ప్రకటన

డల్లాస్ (అమెరికా): గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గోదావరి మహా పుష్కరాల ఫొటోగ్రఫీ కాంటెస్ట్ -2015 విజేతల వివరాలను ఆ సంస్థ అధ్యక్షులు ప్రొ. వెలగపూడి ప్రకాశరావు మరియు బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.   
 
ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతుల విజేతలకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు మరియు కన్సొలేషన్ విజేతలకు ఒక్కోక్కరికి రూ.5 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు 4 అక్టోబర్ 2015న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో రోడ్ నం. 2, ప్రసాద్ లాబ్స్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేయబడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫొటోగ్రఫీ పోటీ న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, చలనచిత్ర నట, సాంకేతిక నిష్ణాతులు శ్రీ డి.స్. దిక్షిత్, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకులు శ్రీ సిరాశ్రీ మరియు ప్రముఖ చలన చిత్ర ఛాయాగ్రాహకులు శ్రీ తోట వెంకట రమణ వ్యవహరించారని తెలిపారు. విజేతల వివరాలు:
 
 
ప్రధమ బహుమతి : రాహుల్, మెహబూబ్ నగర్
ద్వితీయ బహుమతి : సురేష్ నూనే, మంచిర్యాల
తృతీయ బహుమతి : పృద్వీ K.V, హైదరాబాద్

కన్సొలేషన్ ప్రైజ్,1.కుమార స్వామి, కరీంనగర్
కన్సొలేషన్ ప్రైజ్, 2.V.K.R.S.శర్మ, నేదునూరు

కన్సొలేషన్ ప్రైజ్, 3.S.రాంబాబు, రాజమండ్రీ
కన్సొలేషన్ ప్రైజ్, 4.నల్లమిల్లి సుబాష్, ఏలూరు

కన్సొలేషన్ ప్రైజ్, 5.బాబు రావు, సికిందరాబాద్