భారత తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించిన ప్రతిభా పాటిల్కు మరో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ నుంచి ఆతిథ్యం అందుకున్న తొలి రాచరికేతర దేశాధినేతగా మన రాష్ట్రపతి చరిత్రకెక్కనున్నారు. ఈ మేరకు బ్రిటన్ రాజకుటుంబం నుంచి అందిన ఆహ్వానంపై ఈ సంవత్సరం అక్టోబర్ 27 నుంచి మూడు రోజులపాటు ప్రతిభా పాటిల్ ఆ దేశంలో పర్యటించనున్నారు. రాణి ఎలిజబెత్ ఆతిథ్యం అందుకోనున్న ప్రతిభ రాణి అధికార నివాసమైన విండ్సర్ కాజల్లో బస చేస్తారు.