దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్ సతీమణి మారీ పాలెంటీ ఘనంగా నివాళులు అర్పించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ) డల్లాస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాలెంటీ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తి వెలిగించి అంజలి ఘటించారు.