తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్మల్ని మహారాష్ట్రలోని త్రివిక్రమ దేవాలయానికి తీసుకువెళుతున్నాం. త్రివిక్రమ ఆలయాన్ని 1744లో సుప్రసిద్ధ సన్యాసులు శ్రీ కడోగి మహరాజ్ నిర్మించారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని షెండూర్ని గ్రామంలో ఖాందేష్ ప్రాంతంలో నెలకొని ఉంది.