కర్నాటక రాష్ట్రంలో వెలసిన గోకర్ణం క్షేత్రానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇక్కడున్న శివలింగాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి ఆత్మలింగంగా పేర్కొంటారు. భారతదేశంలోని గొప్ప శైవ క్షేత్రాలైన కాశీ, రామేశ్వరం క్షేత్రాల తర్వాత గోకర్ణంకు అంతటి విశేష ప్రాధాన్యం ఉంది.