కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు, ఏడు కొండలపైనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రూపాలలో వెలసి తన భక్తులను పావనం చేస్తున్నాడు. ఏడుకొండలపై పాదం మోపకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో గల మల్దకల్ మండలంలో ఆదిశిలలో శ్రీనివాసుడు ఉద్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహ, అనంతశయనమూర్తి రూపంలో వెలియటమే ఈ క్షేత్రం ప్రత్యేకత.