కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం చిన్న తిరుపతిగా భక్తులు పిల్చుకునే ద్వారక తిరుమల. తిరుమల తర్వాత భక్తులు ఈ చిన్న తిరుమలకు కూడా అదే రీతిగా ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది కావడం విశేషం.