క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో ఒకటి హరిద్వార్. ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్.. ఆ శ్రీహరిని చేరుకునేందుకుగల దారిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ఈ పరమ పవిత్ర ప్రదేశాన్ని ఓసారి దర్శిద్దామా..?!