ఆ రోజుల్లో సమాజంలో నెలకొన్న అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఉద్భవించిన భగవత్ స్వరూపమే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన హిందూ-ముస్లిం సఖ్యత, సర్వమానవ సమానత్వం, సహపంక్తి విందులు పాటించటంతోపాటు కాలజ్ఞానాన్ని బోధించేవారు. శాంతి అభ్యుదయాలను నెలకొల్పేందుకు, లోక కళ్యాణార్థం తపస్సు చేసేందుకు వీర బ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి అయ్యారు.