మహారాష్ట్రలోని పంఢర్పూర్ను దక్షిణ కాశీగా హిందువులు పేర్కొంటారు. ఆ రాష్ట్ర వాసులు తమ కులదైవంగా శ్రీ విఠలా-రుణ్మికీ అమ్మవారిని కొలుస్తారు. భక్తి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన సంత్ తుకారం, సంత్ నామదేవుడు, సంత్ పురంధర్ దాసు, ఛిక్లా మేలా, జానాబాయిలు విఠలుడిని...