కైలాసాన్ని, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అసాధ్యమైనపని. అలాంటి అనుభూతిని కలిగించే ఓ ఆలయం ఉందంటే ఎంత భాగ్యమో కదూ.. ఎలాగైనా సరే ఆ భూ కైలాసాన్ని చూసి తీరాల్సిందేనని మనసు పరుగులు తీయటం ఎవరికైనా సహజం. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే చెన్నైకి బయల్దేరితే సరి..!