రాళ్లు పడినా పర్వాలేదుగానీ... కంటి దిష్టి పడకూడదని పెద్దలు చెబుతుంటారు. అలాంటి దిష్టిదోష నివారణా క్షేత్రంగా తిరుత్తణి సమీపంలోని నాబళూరు శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. భైరవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని అగస్తీశ్వరుడు నిత్యం పూజలందుకుంటూ, భక్తులకు తన కరుణా కటాక్ష వీక్షణాలను అందిస్తున్నాడు.