ఆంధ్రప్రదేశ్లో కొలువైన పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం కూడా ఓ విశిష్ట స్థానాన్ని దక్కించుకుంది. వినాయకుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. కోరిన కోర్కెరు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కాణిపాకం వినాయకున్ని సేవించడం విశేషం.