రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరులో సతీ సమేతంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు బాలాజీ పేరుతో భక్తుల కొంగు బంగారంగా సేవలందుకుంటున్నాడు. తెలంగాణా బాలాజీగా, వీసా బాలాజీగా పలు పేర్లతో పిలవబడే ఈ చిలకూరి బాలాజీ ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.