కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల మధ్య శ్రీ భ్రమరాంభికాదేవి సమేతంగా మహాశివుడు శ్రీమల్లిఖార్జునుని రూపమున వెలసిన దివ్యక్షేత్రం శ్రీశైలం. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ శైవ క్షేత్రం నిత్యం శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది.