తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రముఖ శుక్రదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.