కనుచూపుమేరలో పెద్ద బండ, దానిపై ఆకర్షణీయమైన ఆలయం, అందులో కొలువుదీరిన స్వామివారిని చూడాలంటే... విజయనగరం జిల్లా, వేపాడ మండలం, గుడివాడలోని శైవక్షేత్రానికి తరలి వెళ్లాల్సిందే. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ముక్కంటిని ఏకశిలపై ప్రతిష్టించమే ఇక్కడి ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. పాండవులు వనవాసం చేసే కాలంలో విరాట పర్వతంపై ఉన్నప్పుడు... వారి పూజల కోసం బ్రహ్మదేవుడు గుడివాడ గ్రామంలోగల ఏకశిలపై శివుడి రూపమైన మూడు శివలింగాలను ప్రతిష్టించినట్లుగా భక్తులు విశ్వసిస్తుంటారు...