నారద మహర్షిచే ప్రతిష్టించబడి.. సంతాన సౌమ్యనాథుడిగా, వీసాల సౌమ్యనాథుడిగా, కలియుగ దైవంగా విరాజిల్లుతున్న సౌమ్యనాథ స్వామి కడప జిల్లాలోని నందలూరులో వెలిశాడు. ఒక్కసారి దర్శిస్తేనే కలలో దర్శనమిచ్చే సౌమ్యనాథుడు.. కోరిక కోర్కెలు తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.