పవిత్ర నదీ జలాలు, సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శించిన సతీ అనసూయ ఆశ్రమం, రామ్ఘాట్, భూ అంతర్భాగంలో ప్రవహించే గుప్త గోదావరీ నదీమతల్లి, హనుమాన్ ధార, జానకీ కుండ్లాంటి పవిత్ర స్థలాలను సందర్శించాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సిందే. ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక విశేషాలెన్నో కలిగిన ఈ ప్రాంతాలు పర్యాటకులకు మరపురాని అనుభూతులను అందిస్తాయి.