డిఫెండర్ పవన్ కుమార్ సారథ్యంలో 20 మంది సభ్యులుగల ఢిల్లీ ఫుట్బాల్ జట్టును డీఎస్ఏ బుధవారం ఎంపికచేసింది. గుర్గాన్ మరియు ఫరీదాబాద్లలో ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు జరుగనున్న దత్తా రే ట్రోఫీలో ఈ జట్టు పాల్గొంటుంది. 19వ జాతీయ ఫుట్బాల్ అండర్-21 విభాగంలో ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.