ఏటీపీ, డబ్ల్యూటీఏ దుబాయ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా వీరుడు నోవాక్ జకోవిచ్, డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకీలకు సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. దుబాయ్లో జరిగిన దుబాయ్ ఏటీపీ టెన్నిస్ చాంపియన్షిప్ ఫైనల్లో జకోవిచ్ 6-3, 6-3 తేడాతో ప్రపం చరెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్పై సంచలన విజయం సాధించాడు. జోకొవిచ్ షాట్లకు ఏ దశలోనూ ధీటుగా ఎదుర్కోలేని ఫెదరర్ రన్నరప్గా నిలిచాడు.