ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: సైనా, శ్రీకాంత్ల శుభారంభం
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, శీకాంత్ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగం తొలిరౌండ్లో 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-16, 21-12తో ప్రపంచ 11వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపును నమోదు చేసుకోగా, మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ 21-10, 21-14తో జోయ్ లాయ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. కానీ సింధు, గురుసాయిదత్ మాత్రం నిరాశపరిచారు.
ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 15-21, 19-21తో ప్రపంచ 40వ ర్యాంకర్ కిమ్ హో మిన్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. అలాగే పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన గురుసాయిదత్ 19-21, 21-12, 15-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో ఖంగుతిన్నాడు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ 22-20, 15-21, 21-15తో ముస్తాఫా (ఇండోనేషియా)పై