సంబంధిత వార్తలు
- ఢిల్లీలో సేన ప్రస్థానం.. అధికారం కాదు.. ప్రజా సంక్షేమంపైనే దృష్టి.. పవన్ కల్యాణ్
- ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు పిలుపు
- కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది.. : పవన్ కళ్యాణ్
- జగన్ బహిరంగ సభలకు అనుమతి ఎందుకివ్వలేదు.. పవనే చెప్పాలి: రేవంతన్న
- ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)
యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 యేళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమలో సుమారు 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ప్రజల ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల తెలంగాణ గడ్డ. అందుకే నాకు ఆ నేల పట్ల, అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆయన ఆరోపించారు.
యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ అసలు ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్ ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
