1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Dangerous Mangoes Hit the Market: Adulterated Mangoes Found in Gosha Mahal

మార్కెట్లోకి వచ్చిన డేంజరస్ మ్యాంగోస్, గోషా మహల్‌లో కల్తీ మామిడిపళ్లు

Adulterated Mangoes
వేసవి వచ్చిందంటే మధుర ఫలం మామిడిపండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. మామిడిపై ప్రజలకు వున్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కల్తీరాయుళ్లు వచ్చేసారు. పచ్చి మామిడికాయలకు విషపూరిత రసాయనాలను పూసి అవి పండిపోయినట్లు కనిపించేవిధంగా చేస్తున్నారు. వాటిని చూడగానే మామిడికాయ పండినట్లే కనబడుతుంది కానీ అది లోపల పచ్చిమామిడి. ఇలాంటి మామిడికాయలను అమ్ముతూ వున్న కల్తీ ముఠాను తెలంగాణ లోని గోషామహల్ మార్కెట్టులో అధికారులు పట్టేశారు. క్వింటాళ్లకొద్దీ వున్న ఈ మామిడికాయలను సీజ్ చేసారు.
 
పచ్చిమామిడికాయలు పండినట్లు, అనేక వ్యాధులకు మూలం
పచ్చి మామిడికాయలపై క్యాల్షియ కార్బైట్ చల్లి అవి పండేటట్టు చేస్తున్నారు. నిజానికి కాల్షియం అనేది క్యాన్సర్ కారక పదార్థం, ఇది మనిషికి చాలా ప్రమాదకరమైనది, క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వాస్తవానికి కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తినడం మానుకోవాలి. మానవ శరీరంపై హానికరమైన వైద్య ప్రభావాల కారణంగా వైద్యులు ఈ మామిడిని నిషేధించారు. ఇలాంటి మామిడికాయలు చాలా హానికరం.
 
క్యాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడికాయల వినియోగం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, తల తిరగడం, మూడ్ ఆటంకాలు, నిద్రలేమి, మానసిక గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెరిబ్రల్ ఎడెమా, మూర్ఛలకు కారణమవుతుంది.
తర్వాతి కథనం
మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో వేధింపులకు గురవుతున్న ప్రతి 10 మందిలో 9 మంది