1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Kazipet Man Dies by Suicide After Video Calling Wife from Railway Track

వీడియో కాల్‌ చేసి.. లైవ్‌లో రైలు కింద పడి ఆత్మహత్య

Kazipet Man
Kazipet Man
వరంగల్ జిల్లాలో ఆస్తుల పంపకంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన భార్యకు మొబైల్‌లో వీడియో కాల్ చేసి, తానేం చేయబోతున్నాడో లైవ్‌లో చూపిస్తూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి సదరు భార్య, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేష్ నాయక్ (45) గా గుర్తించారు. 
 
గత కొంతకాలంగా రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై తీవ్రస్థాయిలో మనస్పర్థలు, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఈ వ్యవహారం సర్దుమణగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆస్తి పంపకాల విషయమై భార్యతో రాజేష్ నాయక్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆగ్రహంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన రాజేష్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
About Writer
సెల్వి