1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. komaram bheem dist : 10th Class Girl Student Swallows Pen Cap, Parents Allege She Was Beaten and Forced

బాలిక నోట్లో పెన్ క్యాప్ పెట్టి నీళ్లు పోసిన సాటి విద్యార్థినిలు... తర్వాత ఏం జరిగింది?

girl
తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాఫులే (ఎంజేపీ) బాలికల గురుకుల విద్యాలయంలో ఓ దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు దాష్టీకం ప్రదర్శించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను బాధిత బాలిక తండ్రి వెల్లడించారు. 
 
గత శనివారం రాత్రి సహచర విద్యార్థినులు తన కుమార్తె కళ్లకు గంతలు కట్టి కాళ్లు, చేతులు బిగిసిపట్టి నోట్లో పెన్ను క్యాప్‌ను వేసి నీళ్లు పోశారు. దీంతో క్యాప్‌ను మింగేసిన విద్యార్థిని ఆ విషయాన్ని విద్యాలయం సిబ్బందికి తెలిపింది. 
 
వారు తండ్రికి సమాచారం ఇవ్వగా.. ఆయన ఆదివారం ఉదయం వచ్చి తన కుమార్తెను మంచిర్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌ చేయగా కడుపులో క్యాప్‌ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. చికిత్స చేసి దాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై అమ్మాయి తండ్రి సోమవారం కాగజ్‌నగర్‌ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వాటర్ బిల్లు కట్టలేదని బెదిరించారు.. రూ. 4.19 లక్షలు పోగొట్టుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి