సంబంధిత వార్తలు
- బీహార్ రాబరీ గర్ల్స్, నగల దుకాణంలో యజమాని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి దోపిడీ యత్నం, వీడియో
- ప్రతికూల వాతావరణం.. హైదరాబాద్కు రావాల్సిన తొమ్మిది విమానాల దారి మళ్లింపు
- తడా హైవేలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఏమైంది?
- Sajjanar: వర్క్ ఫ్రమ్ బైక్.. పెట్రోల్ ట్యాంక్పై ల్యాప్టాప్ ఉంచి వాహనం నడుపుతూ.. (video)
- సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
రెండో అంతస్థు నుంచి దూకి ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య... కారణం?
కుటుంబ కలహాల కారణంగా ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఆరు నెలల గర్భిణి ఒకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. హోతి (కె) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ వివాదం కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి.
పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
