1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Two youths died in the Old City after snapping power lines fell on them during monsoon rains

Monsoon rains, పాతబస్తీలో విద్యుత్ తీగలు తెగి తగలడంతో ఇద్దరు యువకులు మృతి

Youth dies of electric shock
మంగళవారం నాడు హైదరాబాదులో Monsoon rains గాలివాన బీభత్సానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
 
బండ్లగూడ సమీపంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు వర్షంలో తెగి పడి వున్న విద్యుత్ తీగలను చూసుకోకుండా వాటిని తగులుకున్నారు. దాంతో వారు అక్కడికక్కడే విద్యుత్ షాక్ కారణంగా మృత్యువాత పడ్డారు. మృతి చెందినవారు చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ద్వారా బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్‌డ్ ఎక్స్‌పీరియెన్సెస్ ఆవిష్కరణ