ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన తల్లి (వీడియో)
హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో గుండెలవిసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూరి నగర్లోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న ఈషా సాహు (37) అనే మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి దూకేసింది. ఈ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. కుటుంబ కలహాలో, భార్యాభర్తల మధ్య గొడవో ఏంటే తెలియదుగానీ, తన ముక్కుపచ్చలారని ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.
ఈ ఘోర ప్రమాదంలో ఈషా సాహు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరు నెలల చిన్నారి మాత్రం అదృష్టవశాత్తు చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కింద ఉన్న ఫెన్సింగ్ తలకు బలంగా తగలడం వల్లే ఆ పరిప్రామం నిలిచినట్టు తెలుస్తోంది. అయితే, ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన తల్లి మృతి
— BIG TV Breaking News (@bigtvtelugu) June 13, 2026
హైదరాబాద్లోని మియాపూర్లో గుండెలవిసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూరి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఈషా సాహూ (37) అనే ప్రైవేట్ ఉద్యోగిని.. తన ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘోర ప్రమాదంలో… pic.twitter.com/nL40MZGrMF
