మహేష్ ''ఆగడు'' పంచ్ డైలాగ్స్.. వివాదం కోసం పవన్పై సెటైర్లు!
ప్రిన్స్ మహేష్ బాబు తన నాన్న కృష్ణకు బర్త్డే కానుకగా 'ఆగడు' ట్రైలర్ని రీలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన ఆగడు ఫస్ట్లుక్ యూత్ని బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహేష్ చెప్పే డైలాగ్స్ సూపర్భ్గా వున్నాయి. అయితే ఈ ట్రైలర్లో ఓ డైలాగ్ పవన్ కల్యాణ్పై సెటైర్లు వేసినట్లుగా వుందనే టాక్ వస్తోంది. పవన్ 'అత్తారింటికి దారేది'లో సింహాం డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా మహేష్ ఆగడులో ''ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్....'' అంటూ ఓ డైలాగ్ ఉంది. దీనిని బట్టి చూస్తే కావాలనే పవన్ కళ్యాణ్పై సెటైర్ వేసినట్లు ఉందని కొందరు అంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో రచ్చ జరిగితే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ప్లాన్ చేసారని, మీడియాలో వివాదాస్పదం కావాలనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఏదైతేనెం ఈ ట్రైలర్ 'ఆగడు' సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసింది. దూకుడు వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్కి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా నదియా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.