''మిర్చి'' డైరక్టర్తో ఎన్టీఆర్ : ఘాటెక్కిస్తాడా?
మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమా చేయనున్నారు. ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా హిట్తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు.
“మిర్చి” సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాబట్టి ఈ మహేష్-శివ కాంబినేషన్లో వస్తున్నా ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కొత్త సినిమాను రూపొందించాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యం వహించనున్నారని తెలిసింది. పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా పూర్తయ్యాక మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమాలో నటించే ఛాన్సుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.