సన్నాఫ్ సత్యమూర్తి: త్రివిక్రమ్ డైలాగ్ అదుర్స్.. నెట్లో హల్చల్!
త్రివిక్రమ్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి తెరకెక్కిన సంగతి తెలిసిందే. 3విక్రమ్ కలం నుంచి జాలువారిన డైలాగ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోనూ ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్లో హల్ చల్ చేస్తుంది. సినిమా ప్రారంభంలో క్లైమాక్స్లో వచ్చే ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. సినిమా కథతో ఇమిడి ఉన్న ఈ డైలాగ్ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్ మీకోసం....
'ఒక' సమస్య
'రెండు' దారులు
'ముగ్గురికి' సమాధానం చెప్పాలి
'నాలుగు' వారాల క్రితం కాసిన పందెం
'ఐదు' వేల మంది ఉన్న ఊరు
'ఆరు' వేల మంది ప్రైవేటు సైన్యం ఉన్న నియంత
'ఏడు' అడుగుల వెయ్యాల్సిన అమ్మాయి
'ఎనిమిది' వందల గజాల స్థలం
'తొమ్మిది' నిముషాలు మిగిలిన సమయం
'పది' అడుగుల దూరంలో చావు !!