బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 జులై 2014 (11:31 IST)

విశాల్‌ షాక్: పైరసీ ఫిర్యాదు.. ఇద్దరు యువకులు అరెస్ట్!

సినీ హీరో విశాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విశాల్ ప్రస్తుతం పూణే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది. 
 
షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తన బస చేసిన హోటల్‌కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను చూశారు. ఆ తర్వాత స్థానిక చానెల్స్‌ను చూసిన విశాల్ షాక్‌కు గురయ్యారు. ఇటీవల విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కుల లేకుండా ప్రదర్శిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. దీంతో విశాల్ కారకుడై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్‌ను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.