సంబంధిత వార్తలు
- నాగార్జునసాగర్ యలేశ్వర మల్లికార్జున స్వామిని దర్శించాలంటే.. పడవలో ప్రయాణించాల్సిందే..
- Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్
- Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది
- Chain Snatching: వరంగల్లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు
- Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది
కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కాశీ యాత్రలో ఉన్నారు. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత, తన పిల్లలు పెద్దవారైన తర్వాత ఆమె సినిమాల్లో రెండో ఇన్నింగ్స్లో ప్రారంభించారు. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్కు సంబంధించిన అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు.
అడ్వర్టైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన యమునా కిషోర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శంకర్ ఇందుచూడన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంద.
ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దర్శకుడు యమునా కిషోర్తో పని చేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని, శంకర్ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి నటించడం ఉత్సాహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, మహాదేవుడి క్షేత్రమైన కాశీలో షూటింగ్ జరగడం తనకు దైవానుగ్రహంగా భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ సినిమా కథ ఏమిటి, టైటిల్ ఏంటి అనే విషయాలను మాత్రం ఆమె గోప్యంగానే ఉంచారు. దీంతో రేణూ దేశాయ్ కొత్త ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
