శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2015 (21:32 IST)

రాజమౌళి బాహుబలి 2... సెల్ ఫోనులతో వస్తే శిక్షార్హులు

రాజమౌళి బాహుబలి పార్ట్‌ 2 విషయంలో కాంప్రమైజ్‌ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 'బాహుబలి- ది కంక్లూజన్‌'కు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొన్ని సీన్‌లు ఎలాగో బయటకు వచ్చాయి. పైగా ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. కానీ నిర్మాతలకు పెద్దగా లాభాలు లేవనేది గతంలో వెబ్‌దునియా చెప్పింది కూడా. 
 
ప్రస్తుత విషయానికి వస్తే.. బయ్యర్లు బాగా లాభం పొందిన ఆ సినిమాలో రెండో భాగంలో నటించేందుకు నటీనటులు పారితోషికం పెంచాలని అడుతున్నారు. నిర్మాతలు యార్లగడ్డ శోభు అతని స్నేహితులు మాత్రం అలా చేసేది లేదని చెప్పడం.. రాజమౌళి కలుగజేసుకుని.. వారిని కంట్రోల్‌ చేయడం జరిగిపోయాయి. పైగా ఫిలింసిటీలో వేసిన సెట్‌లో.. ఎవ్వరినీ అనుమతించడంలేదు. యూనిట్‌ సెల్‌ఫోన్లు అన్నీ లాగేసుకుంటున్నారు. ఎవరైనా సరే నో సెల్‌ఫోన్స్‌.. అంటూ బోర్డు పెట్టారు. అలా వస్తే శిక్షార్హులు అని కూడా రాసి పెట్టారు.