1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I am considering having public representatives undergo drug tests as well: Manchu Vishnu

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

Manchu Vishnu
Manchu Vishnu
రాష్ట్రంలో మాదవద్రవ్యాలు తీసుకుంటున్నట్లు ముందుగా పోలీసులు దాడిచేసేది సినిమారంగంలోని వారిపైనే. చాలా కాలంగా ఇది కొనసాగుతుంది. హైదరాబాద్ లోని నానక్ రామ గూడాలోనూ, ఇతర ప్రాంతాల్లో హైటెక్ స్కూల్స్ లోనూ పిల్లలు డ్రెగ్ కు అలవాటు పడ్డారనీ, వారిలో పోలీసు అధికారుల పిల్లలు, రాజకీయనాయకుల పిల్లలు వున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని పై స్థాయిలో ఇష్యూను డైవర్ట్ చేయడానికి సినిమారంగంలోని నటీనటులపై దాడి చేశారంటూ కొందరు అప్పట్లో స్పందించారు. తాజాగా నిన్న నటి హేమ డ్రెగ్ తీసుకోలేదని నన్ను అనవసరంగా బద్ నామా చేసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించారని వాపోయింది. 
 
ఇది జరిగాక తాజాగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సినీ నటుడు మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం మొదలైంది. సినిమా హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు విష్ణు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జడ్చర్లలో డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
దానికి మా' మాజీ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు.. "ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయ నాయకులు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. ప్రజా ప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు సంతోషిస్తారని నేను భావిస్తున్నాను" అని విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం హీరోలు వర్సెస్ రాజకీయ నాయకులుగా మారింది.
 
తర్వాతి కథనం
కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్