ఆన్లైన్లో జనతా గ్యారేజ్ అదుర్స్.. ట్రైలర్కు 30లక్షల వ్యూవ్స్.. జూక్ బాక్స్కు 10 లక్షల హిట్స్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకుడిగా రూపొందుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకుడిగా రూపొందుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
ఈ చిత్రం ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 12న యూట్యూబ్లో విడుదలైన ట్రైలర్ను ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మందికి పైగా వీక్షించారు. అదేవిధంగా ఈ చిత్రం జూక్ బాక్స్కు 10 లక్షల హిట్స్ లభించాయి. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు సోషల్మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 2న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.