శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (17:17 IST)

Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున

Nagarjuna Akkineni
Nagarjuna Akkineni
నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, సిబ్బంది, హాజరైన వారందరికీ ఒక చిరస్మరణీయ క్షణాన్ని అందించారు.
 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,.. తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్,  మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు.
 
“ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత.
 
ఈ ప్రకటనకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కరతాళ ధ్వనులు లభించాయి. ఇది కేవలం కుటుంబం యొక్క ఉదారతను మాత్రమే కాకుండా, విద్య, సమాజ సేవతో వారికి ఉన్న శాశ్వత అనుబంధాన్ని కూడా చాటింది.